అంబటి రాంబాబు: కేసులపై పోరాటం కొనసాగిస్తాం - వైసీపీ నాయకుల ధైర్యం 💪
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏన్ని అక్రమ కేసులు ఎదురైనా, న్యాయస్థానాల ద్వారా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అంబటి రాంబాబు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Asianet News Telugu
4.6K views • May 9, 2025
About this video
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు సీఐడీ ఆఫీస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 'వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి సిఐడి ఆఫీస్ కి పిలిచారు. ఒకపక్క ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే.. కూటమి ప్రభుత్వం మాత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సజ్జల రామకృష్ణ రెడ్డిని గుంటూరు పిలిస్తే వేలాదిగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. మమ్మల్ని ఎంత అణచివేయాలని ప్రయత్నం చేస్తే, అంత పైకి లేస్తాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన, న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అక్రమ కేసులు పెట్టిన, తిరిగి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం. చర్యకు, ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుంది` అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.<br /><br />#ambatirambabu #sajjalaramakrishnareddy #ysrcp #tdp #apcid #andhrapradesh #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Video Information
Views
4.6K
Duration
7:18
Published
May 9, 2025
User Reviews
3.8
(4) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.