కాటన్ దొర మనవరాలు నిరాశగా, ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారు 😔
Nimmala Ramanaidu వివరణ: కాటన్ దొర మనవరాలు ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఖరిఫ్ పంటలకు తుఫాను నుంచి రక్షణ కోసం ముందస్తు జలవనరుల ఏర్పాట్లు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు ఇచ్చారు.
Asianet News Telugu
501 views • Jun 7, 2025
About this video
ఖరిఫ్ పంట తుఫాను బారిన పడకుండా ముందుగానే సాగు నీటిని అందజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జలనరుల శాఖ ప్రాజక్టుల ప్రగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారీ, మధ్యస్థ, చిన్నతరహా ప్రాజెక్టుల్లో దాదాపు 516 టి.ఎం.సి.ల జలాలు నిల్వ ఉన్నాయని, ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం 200 టి.ఎం.సి. నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచనలు చేశారన్నారు. నదుల అనుసంధానంతో కరువు తీరుతుందన్నారు. గోదావరి నీళ్లు సముద్రంలోకి వృథాగా పోవడం చూసి.. ధవలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత గోదావరిపై ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేకపోయారా అని కాటన్ దొర మనమరాలు ఆవేదన వ్యక్తం చేసిందని తెలిపారు.<br /><br />#nimmalaramanaidu #budameru #polavaram #banakacharla #chandrababu #irrigationprojects #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Video Information
Views
501
Duration
25:59
Published
Jun 7, 2025
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.